సరిగా ఈ నెల 12న విజయనగరం జిల్లా కు ఎస్పీగా ఎం దీపికా పాటిల్..చార్జ్ ఈసుకుని ఏడాది అవుతోంది.చార్జ్ తీసుకున్నప్పటి నుంచీ… పలు పోలీసు స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ లు చేసి…పరిపాలన పరంగా అటు స్టేషన్ లలో నమోదు వుతున్న కేసుల పరిష్కారంలో కూడా ఆయా స్టేషన్ సిబ్బంది ని ఎప్పటికప్పుడు అలెర్ట్ చేస్తున్నారు.
ఈ క్రమంలో నే తాజాగా రాజాం ,మరియు చీపురుపల్లి పోలీసు స్టేషన్ లను ఎస్పీ దీపికా ఆకస్మికంగా పర్యటించి తనిఖీలు చేసారు. ఈ మేరకు ముందు గా చీపురుపల్లి పోలీసు స్టేషన్ ను ,ఆ తర్వాత రాజాం పీఎస్ ను ఎస్పీ సందర్శించి, రిసెప్షన్, స్టేషను రికార్డులను, సీడీ ఫైల్స్ ను పరిశీలించి, సీఐ, లకు పలు సూచనలు చేశారు. జిల్లా ఎస్పీ వెంట చీపురుపల్లి సీఐ జి.సంజీవ రావు, ఎస్ఐ సన్యాసి నాయుడు ఉన్నారు.