నాలుగేళ్ల క్రితం సీఎం జగన్ ప్రభుత్వ హయాంలో కొత్తగా ప్రవేశ పెట్టిన “దిశ” పోలీసు శాఖ అధిపతిగా ఉండే..ఎస్పీ ఎం దీపికా పాటిల్… రాష్ట్రంలో ని విజయనగరం జిల్లా ఎస్పీ గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తవుతోంది. విజయనగరం జిల్లా ఎస్పీ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ… తన దైన శైలిలో… శాఖా పరంగా… సిబ్బంది ని ఎప్పటికప్పుడు అలెర్ట్ చేస్తూ…మూడో ఏడాది లో అడుగు పెట్టిన ఎస్పీ…తాజాగా విజయనగరం కంటోన్మెంట్ పోలీసు బ్యారెక్స్ వద్ద సీఎం జగన్ స్వహస్తాలతో కొత్తగా ప్రారంభించ బడిన “దిశ” పోలీసు స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ మేరకు ” దిశ” మహిళ పోలీసు స్టేషను ను ఆకస్మికంగా సందర్శించారు. స్టేషను రికార్డులు, రిసెప్షన్ రికార్డులు, సీడీ ఫైల్స్ ను తనిఖీ చేశారు. మహిళల రక్షణకు, భద్రతకు ప్రత్యేకంగా రూపొందించిన దిశ ఎస్.ఓ.ఎస్ యాప్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని, పోలీసు స్టేషనుకు వచ్చే బాధితుల సమస్యలను తెలుసుకొని, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో “దిశ” ఇన్ ఛార్జ్ డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, సిఐ బి.నాగేశ్వర రావు హాజరుగా ఉండి, నమోదైన కేసుల్లో సాధించిన ప్రగతిని జిల్లా ఎస్పీకి వివరించారు. ఎస్ ఐ లు ,సిబ్బంది ఉన్నారు..