విజయనగరంలో కొత్తపేట వద్ద నూతనంగా నిర్మించిన టూటౌన్ పోలీసు స్టేషను నూతన భవనాన్ని రాష్ట్ర డిజిపి గౌతం సవాంగ్ ప్రారంభిస్తున్న సందర్భంగా, విజయనగరం జిల్లా ఎస్పీ దీపిక, సందర్శించి ప్రారంభోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ సిఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి, రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇతర ప్రముఖులు పాల్గొననున్నారు. జిల్లా ఎస్పీ వెంట విజయనగరం అదనపు ఎస్పీ పి.సత్యనారాయణ రావు, విజయనగరం సబ్ డివిజన్ అదనపు ఎస్పీ అనిల్ పులిపాటి, ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహన రావు, ఎస్సీ మరియు ఎస్టీ సెల్ డీఎస్పీ ఆర్.శ్రీనివాస రావు, ఎ.ఆర్ డిఎస్పీ ఎల్.శేషాద్రి, సి.ఐ లు, ఎస్.ఐ లు ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
next post