విజయనగరం జిల్లాలో ఉన్నశైవ క్షేత్రాలలో శివరాత్రి సంబరాలు….వైభవంగా జరుగుతున్నాయి. ముందు రోజు మధ్యాహ్నం నుంచీ అన్నిశైవ క్షేత్రాల వద్ద భక్తులు శివన్న దర్శనం కోసం పొటెత్తారు. ఉత్తరాంధ్రలోఅందులోనూవిజయనగరం జిల్లాకు అనుకునిఉన్న ప్రసిద్దశైవ క్షేత్రం రామతీర్ధంలోశివరాత్రి సందర్బంగాభక్తులు పొటెత్తారు.
దాదాపు 300 మంది సిబ్బందితో ఎస్పీ దీపికా బందోబస్తు ఏర్పాటు చేసారు.ఈ మేరకు మహాశివరాత్రి ఉదయమే పోలీస్ బాస్ దీపిక వెళ్లి…శివయ్య దర్శనం చేసుకున్నారు.పనిలోపనిగా…శాఖా సిబ్బంది నిర్వహిస్తున్న డ్యూటీని ప్రత్యక్షంగా చూసారు. అక్కడే కోనేరు వద్ద భక్తుల తాకిడి..సందోహం…సిబ్బంది పనితీరును ప్రత్యక్షంగా చూసారు. తాజాగా…మరో ప్రసిద్ద పుణ్యక్షేత్రం ఎస్.కోట పరిధిలోఉన్న పుణ్యగిరిని దర్శించుకున్నారు….ఎస్పీ దీపిక.
ఈ మేరకు ఉదయ్ం…ఏఎస్పీ అనిల్ తో కలిసి…పుణ్యగిరి కొండ ఎక్కి…శివయ్య దర్శనం చేసుకున్నారు. అక్కడే పోలీసు సేవాదళ్ నిర్వహించే సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్బంగా పుణ్యగిరి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎస్పీ స్వయంగా పులిహోర ప్రసాదం ప్యాకెట్లను అంద చేసారు .అలాగే గిరిపై భక్తుల సందోహం…క్యూలైన్ల ఏర్పాటు…ఎస్.కోట సర్కిల్ పోలీసులు బందోబస్తు చూసిన ఎస్పీ…సిబ్బందికి కొన్ని సూచనలను జారీ చేసారు.
ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం