జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాల పేద ప్రజల ఆస్తులు కూల్చడమే పనిగా పెట్టుకుందని టిడిపి రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి అన్నారు మంగళవారం సంధ్య సర్కిల్లోని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి కి చెందిన కట్టడాన్ని కూల్చివేయడంపై ఆయన ఆగ్రహ వ్యక్తం చేశారు ఎటు వంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా విచారించకుండా ఆస్తులను కూల్చడం సరైన పద్ధతి కాదని అన్నారు
ఆయన స్థలాన్ని ఎక్కడ కబ్జా చేయలేదని తన స్థలాన్ని గుడి కోసం వదిలిపెట్టారని అన్నారు నగరంలో అధికారులు ప్రతిపక్షాల పేదల ఇల్లు నిర్ధాక్షణంగా వాస్తవాలు తెలుసుకోకుండా కూలుస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని అన్నారు ప్రజలు పాలించమని అధికారం ఇస్తే ఈ కుల్చడాలు ఏమిటి అన్నారు నగరంలో వైసిపి నాయకులు కబ్జాలు చేసిన వాటిని పట్టించుకోని అధికారులు ప్రజలపై ప్రతిపక్షాల ఆస్తులపై ఒంటి కాలు మీద వస్తున్నారని అన్నారు
కొంతమంది సిబ్బంది అధికారులు కమిషనర్ కు తప్పుడు సమాచారం ఇచ్చి కూల్చివేతలు చేస్తున్నారని అన్నారు ఇవి ఎక్కువ రోజులు సగవని తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ న్యాయం చేస్తామని అన్నారు