రామతీర్థం పుణ్యక్షేత్రం ను సందర్శించిన విజయనగరం జిల్లా ఎస్పీ దీపికా…!
ఏపీలో ప్రసిధ్ధి పుణ్యక్షేత్రం… రామతీర్థం ను విజయనగరం జిల్లా ఎస్పీ దీపికా సందర్శించారు. గతేడాది మాదిరిగా నే ఈ ఏడాది కూడా… శివరాత్రి రోజు మధ్యాహ్నం సమయంలో ఎస్పీ దీపికా… రామతీర్థం పుణ్యక్షేత్రం ను సందర్శించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా… సిబ్బంది వ్యవహరించాలని..దురుసుగా ప్రవర్తించొద్దని…మర్యాద పూర్వకంగా భక్తులకు సూచనలు ఇవ్వాలని ఎస్పీ… సీఐ ర్యాంక్ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. ఎస్పీ వస్తున్నారని సమాచారం అందుకున్న ఆలయ ఈఓ..అర్చకులు మేడంకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రామతీర్థం లో రాములోరి దర్శనం చేసుకున్న అనంతరం…ఆ పక్కనే ఉన్న శివాలయం కు వెళ్లిన ఎస్పీకి ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వర్తించారు.