జర్నలిస్టుల వేధింపులు భరించలేని మరొక జర్నలిస్టు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా లో జరిగింది. గోపాలపురం రిపోర్టర్ నాగేంద్రబాబు ఆత్మహత్యాయత్నం జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగించింది. సాటి రిపోర్టర్ల వేదింపులు తాళలేక నిన్నటి నుంచి నాగేంద్రబాబు కనిపించకుండా పోయాడు. అతని కోసం అతని కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు.
అయితే కొవ్వూరు వద్దకు వెళ్లిన నాగేంద్రబాబు గోదావరిలో దూకేశారు. రిపోర్టర్ నాగేంద్రబాబు గోదావరిలో దూకడం చూసిన జాలర్లు అతడిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. చికిత్స నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాగేంద్రబాబు ఆరోగ్యం విషమంగా ఉందని చికిత్స అందిస్తున్న డాక్టర్లు తెలిపారు. సాక్షి శ్రీహరి, టీవీ 5 ప్రసాద్, ఏబీఎన్ టీవీ ప్రసన్న, ప్రైమ్ 9 పృద్వి, 99 టీవీ నాగబాబు వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసినట్లు నాగేంద్రబాబు తెలిపాడు. ఈ ఐదుగురిని కఠినంగా శిక్షించాలని నాగేంద్రబాబు కోరాడు.