29.7 C
Hyderabad
May 2, 2024 06: 18 AM
Slider విజయనగరం

టీడీపీ సీనియ‌ర్ నేత‌ను ప‌రామ‌ర్శించిన అధితి గ‌జ‌ప‌తి రాజు

#AdithiGajapatiraju

ఇన్నాళ్లు నిస్తేజంలో ఉన్న విజ‌య‌న‌గ‌రం జిల్లా టీడీపీని తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్ర మాజీ మంత్రి,పార్టీ సీనియ‌ర్ నేత‌,పోలిట్ బ్యూరో స‌భ్యుడు అశోక్ గ‌జ‌ప‌తి రాజు కుమార్తె పార్టీ జిల్లా ఇంచార్జి ఆధితి గ‌జ‌ప‌తిరాజు రంగంలోకి దిగారు.

 పార్టీనే న‌మ్ముకుని ఉన్న నేత‌ల‌ను కార్య‌క‌ర్త‌ల‌ను ప‌రామ‌ర్శించాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నారు. అందులో భాగంగా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పార్టీ  నేత మేకా కాశీ విశ్వేరుడు ని టీడీపీ నేత‌లంతా వెళ్లి  ప‌రామ‌ర్శించారు.

పార్టీ జిల్లా ఇంచార్జి  అదితి గజపతిరాజు,  జిల్లా అధ్య‌క్షుడు ఐవీపీ రాజు, మాజీ కౌన్సిల‌ర్ విజ్జపు ప్రసాద్ , కంది మురళీ నాయుడు, కర్రోతు నర్సింగరావు, పార్టీకి  చెందిన ఇత‌ర నేత‌లు ఉన్నారు.

ఈ సందర్బంగా కాశీ విశ్వేశ్వ‌రుడు ఆరోగ్యం  గురించి తెలుసుకునేందుకు స్వ‌యంగా ఆయ‌న ఇంటికెళ్లారు. యోగ క్షేమాలు, అరోగ్యం ఎలాగుంద‌ని అడిగి తెలుసుకున్నారు.

Related posts

వివేకా మర్డర్ కేసు: దిగజారి పోయిన పార్టీ పరువు

Satyam NEWS

పొలంలో ఆలుగడ్డలు పండించిన తెలంగాణ వ్యవసాయ మంత్రి

Satyam NEWS

పాతపట్నం మండలంలో నిత్యావసరాల పంపిణీ

Satyam NEWS

Leave a Comment