38.7 C
Hyderabad
May 7, 2024 15: 12 PM
Slider చిత్తూరు

31 నుండి ఫిబ్ర‌వ‌రి 2 వ‌ర‌కు తిరుమ‌ల‌లో పల్స్‌పోలియో

#TTD

శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులు, స్థానికుల సౌకర్యార్థం టిటిడి ఆధ్వర్యంలో తిరుమలలో జ‌న‌వ‌రి 31 నుండి ఫిబ్ర‌వ‌రి 2వ తేదీ వ‌ర‌కు మూడు రోజుల పాటు పల్స్‌పోలియో కార్యక్రమం జరుగనుంది.

ఇందుకోసం టిటిడి వైద్య విభాగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ముఖ్య వైద్యాధికారి డాక్ట‌ర్ ఎబి.న‌ర్మ‌ద తెలిపారు. ఐదేళ్ల లోపు చిన్నారులకు తప్పక పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఇందుకోసం వైద్యసిబ్బంది, ఎన్‌సిసి క్యాడెట్లు, ఇతర సిబ్బంది సేవలందిస్తారని తెలిపారు.

ఈ మూడు రోజుల్లో ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు శిబిరాల్లో పోలియో చుక్కలు వేస్తారు. తిరుమలలో శ్రీవారి ఆలయంలో 1, భక్తుల కోసం వివిధ ప్రాంతాల్లో 20, స్థానికుల కోసం 4 కలిపి మొత్తం 25 శిబిరాలను ఏర్పాటుచేశారు.

ఈ కార్య‌క్ర‌మంపై తిరుమ‌ల‌లోని భ‌క్తుల‌కు, స్థానికుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు జ‌న‌వ‌రి 30వ తేదీ శ‌నివారం ఉద‌యం 10 గంట‌ల‌కు ఎస్వీ హైస్కూల్, ఎస్వీ ప్రాథ‌మిక పాఠ‌శాల విద్యార్థుల‌తో ర్యాలీ నిర్వ‌హిస్తారు.

Related posts

రమేష్ కుమార్ కేసులో ఫైనల్ హియరింగ్ 28న

Satyam NEWS

మతిస్థిమితం లేని ఈ వ్యక్తి వివరాలు తెలిస్తే చెప్పండి

Satyam NEWS

కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ లో చేరిన ఎల్లారెడ్డి జడ్పీటీసీ

Satyam NEWS

Leave a Comment