విజయనగరం డీఎస్పీ కి ఏఎస్పీ గా పదోన్నతి
ఏడాది క్రితం విజయనగరం డీఎస్పీ గా వచ్చిన అనిల్ పీ....అనతికాలంలోనే పదోన్నతి పొందారు. ఇటీవలే పదోన్నతులు జాబితాలో ఉన్న డీఎస్పీ కి రెండు రోజుల క్రితమే ఏఎస్పీ గా పదోన్నతి పొందారు. నేడో రేపో విశాఖ రేంజ్ లో నర్సీపట్నం ఏఎస్పీ గా వెళ్లనున్న ట్టు సమాచారం. కాగా అమరావతి వెళ్లిన ఏఎస్పీ అనిల్...డీజీపీ చేతుల మీదుగా షోల్డర్ ఫ్లాప్ ను తొడిగించుకున్నారు.ఈ మేరకు స్వయంగా డీజీపీ గౌతమ్ సవాంగ్...తన కార్యాలయంలో నే ఏఎస్పీ అనిల్ కూ శాఖా పరంగా బహుకరించి...అధికారికంగా పదోన్నతి కి పట్టం కట్టారు. ఇదే విషయాన్ని డీజీపీ పీఆర్ విభాగం పేర్కొంది.