26.7 C
Hyderabad
May 3, 2024 09: 18 AM
Slider కడప

భత్యాల తో పింఛన్, రేషన్ కార్డు బాధితుల గోడు

bhatyala 07

కడప జిల్లా రాజంపేట పట్టణంలో ని ఈడీగపాళ్లెం లో శుక్రవారం మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాజంపేట ఇన్ చార్జి భత్యాల చెంగలరాయుడు ప్రజా హిత పాదయాత్ర చేశారు. ఇంటింటికి తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

రాజంపేట పట్టణం ఈడిగపాలెంలోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి గుడి లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉదయం చంగల్ రాయుడు ఆధ్వర్యంలో ఈ “ప్రజాహిత పాదయాత్ర” మొదలైంది. ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశ్యం ప్రజల వద్దకే వెళ్లి ప్రజల సమస్యలను కనుక్కొని వాటిని తీర్చడమే. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని తెలియ జేయడమే లక్ష్యం. ఈ పాదయాత్ర లో పలువురు వృద్ధులు అర్హులైన తమకి పింఛన్ లు, రేషన్ కార్డులను తొలగించారని ఆయనకి చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు భత్యాల స్పందించి లబ్ధిదారుల తరపుకన కోర్టుకు వెళ్లి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి రాజంపేట పట్టణంలోని టీడీపీ నాయకులు డాక్టర్ సుధాకర్, కళాధర్ బాబు, మందపల్లె శ్రీను, పోలి శివా, సుబ్రమణ్యం నాయుడు, దరిమిశెట్టి సుబ్రహ్మణ్యం, సర్పుద్దీన్, మందా శ్రీను, చంద్ర మౌళి, సునీల్ తదితర కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

వర్ష ప్రాంతాలలో పర్యటించిన గోల్నాక కార్పొరేటర్

Satyam NEWS

ప్లీజ్ సర్:కరీంనగర్ ఖాజీపేట రైల్వే లైన్ కు నిధులు

Satyam NEWS

ఓవైపు సిరిమాను సంబరం..మరోవైపు కంట్రోల్ రూంలో వర్షపు నీరు

Satyam NEWS

Leave a Comment