గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని జూలకల్లు గ్రామ శివారులో గల మాచర్ల నరసరావుపేట ప్రధాన రహదారి లో ఈ అకాల వర్షానికి గ్రామ శివారు లో ఉన్న వాగు పొంగిపొర్లుతున్న డంతో వాహనాల దారులరాకపోకలకు తీవ్ర ఇబ్బందులు నెలకున్నాయి.
వాగులోని కరెంట్ ట్రాన్స ఫారం సైతం వాగులో చిక్కుకొని దానికి సైతం నీరు రావడంతో ఆ గ్రామ ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. గతంలో ఆ ట్రాన్స్ఫర్ అక్కడి నుంచి వేరే చోటుకు మార్చమని ఎన్నిసార్లు విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఇప్పుడు పరిస్థితి దారుణంగా ఉందని ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థంకాక అక్కడి గ్రామ ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయం గుప్పెట్లో బతుకుతున్నారని అక్కడి కాలనీవాసులు తెలిపారు ఈ అకాల వర్షానికి ప్రత్తి మిర్చి రైతులు కి అపార నష్టం వాటిల్లిందని రైతులు తమ తమ గోడు వెళ్ళబుచ్చుకుంటున్నారు.