31.7 C
Hyderabad
May 2, 2024 10: 13 AM
Slider మెదక్

ముదిరాజ్ లకు ప్రాధాన్యతనివ్వని తెలంగాణ ప్రభుత్వం

#mudiraj

సమాజంలో ఎంతో కీలకమైన భూమిక పోషిస్తున్న ముదిరాజ్ లకు తెలంగాణ ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం శోచనీయమని తెలంగాణ మత్య్సకార సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, రాష్ట్ర కార్యదర్శి కొమురవెళ్లి నర్సింహులు అన్నారు.

సిద్దిపేట జిల్లా, కొండపాక మండలం, దుద్దెడ గ్రామంలో నేడు న తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మత్య్సకార సంక్షేమ సంఘం మండల సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శిగా చిలుముల నరహరి, కన్వీనర్ గా కాస రమేష్, కార్యదర్శిగా మైలరం పెద్ద శ్రీనివాస్ లను నియమించారు. ఈ సందర్భంగా జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ సమాజంలో ఎన్నో మార్పులు తెచ్చిన ముదిరాజ్ లను ఆదరించకపోవడం అన్యాయమని అన్నారు.

ముదిరాజ్ లను తక్షణమే గుర్తించి తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు పడిగె భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రాములు, నారాయణ, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఒక పూట అన్నం మానేసి పేదలకు పంచిపెట్టండి

Satyam NEWS

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించలేo

Bhavani

Over The Counter Hoodia Plant Hoodia Hoodia Weight Loss Diet Pill Going Off The Pill And Weight Loss

Bhavani

Leave a Comment