వివేకానంద రెడ్డి హత్యకేసు విచారణను తెలంగాణ రాష్ట్రానికి సుప్రీం కోర్టు బదిలీ చేసింది. వివేకా కూతురు సునీత అభ్యర్థన మేరకు కేస్ ని తెలంగాన కి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్నది. వివేకా కుమార్తె సునీత పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. కేసును హైదరాబాద్ సీబీఐ స్పెషల్ కోర్టుకు బదిలీ చేస్తూ జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. కాగా నేర విచారణ నిష్పాక్షికంగా జరపడం కోసమే విచారణ బదిలీ అని న్యాయస్థానం పేర్కొన్నది.
previous post