ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి యువకుడు మృతి చెందిన సంఘటన మంగళవారం రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ అర్బన్ మండలం రుద్రవరంలో చోటు చేసుకుంది.
వేములవాడ టౌన్ సిఐ వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం రుద్రవరం గ్రామానికి చెందిన మహమ్మద్ హైమద్ అనే వ్యక్తి వేములవాడ-సిరిసిల్ల ప్రధాన రహదారిలోని నందీ కమాన్ వద్ద మాదీనా చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు.
రోజు మాదిరి గానే మంగళవారం హైమద్ కుమారుడు సమ్రాన్ వెళ్లి చికెన్ సెంటర్ తెరిచి ఏయిర్ కూలర్ స్టార్ట్ చేశాడు.
అయితే కూలర్ ప్లగ్ ఇనుప టేలకు అనుకోని ఉండటంతో దానిని గమనించని సమ్రాన్ టేలను పట్టుకోవటంతో విద్యుత్ షాక్ తగిలి సమ్రాన్ అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడి తండ్రి హైమద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సిఐ వెంకటేష్ తెలిపారు.