38.2 C
Hyderabad
May 2, 2024 19: 22 PM
Slider కరీంనగర్

చికెన్ సెంటర్ లో కరెంట్ షాక్: యవకుడు మృతి

#vemulawada

ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి యువకుడు మృతి చెందిన సంఘటన మంగళవారం రాజన్న సిరిసిల్లా జిల్లా   వేములవాడ అర్బన్ మండలం రుద్రవరంలో చోటు చేసుకుంది.

వేములవాడ టౌన్ సిఐ వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం రుద్రవరం గ్రామానికి చెందిన మహమ్మద్ హైమద్ అనే వ్యక్తి వేములవాడ-సిరిసిల్ల ప్రధాన రహదారిలోని నందీ కమాన్ వద్ద మాదీనా చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. 

రోజు మాదిరి గానే మంగళవారం హైమద్ కుమారుడు సమ్రాన్ వెళ్లి చికెన్ సెంటర్ తెరిచి ఏయిర్ కూలర్    స్టార్ట్ చేశాడు.

అయితే కూలర్ ప్లగ్ ఇనుప టేలకు అనుకోని ఉండటంతో దానిని గమనించని  సమ్రాన్ టేలను పట్టుకోవటంతో విద్యుత్ షాక్ తగిలి సమ్రాన్ అక్కడికక్కడే మృతి చెందాడు.

మృతుడి తండ్రి  హైమద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సిఐ వెంకటేష్ తెలిపారు.

Related posts

షర్మిలకు జగన్ అప్పు ఎందుకు ఇచ్చాడు?

Satyam NEWS

కరెంటు చార్జీల మళ్లీ పెంచిన జగన్ రెడ్డి

Satyam NEWS

అక్కడ అమ్మాయికి పెళ్లి ఇక్కడ అబ్బాయికి ఇల్లు

Satyam NEWS

Leave a Comment