ఆవులను అక్రమంగా తరలిస్తున్న ముఠాను విశాఖ పోలీసులు అడ్డుకున్నారు. క్రైమ్ డిసిపి నాగన్న ఆదేశాలు మేరకు నిఘా వేసిన విశాఖ పోలీసులు గోవుల అక్రమ తరలింపును అడ్డుకున్నారు. విశాఖ జూ పార్క్ సమీపంలో టాటా వన్ మీద గోవులను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.
ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఈ సందర్భంగా 4 అవులు ఒక పెయ్య ను తరలిస్తున్న వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. గోవులను జూలో ఉన్న పులిలుకు ఆహారం గా తీసుకెళుతున్నామని కట్టుకథలు చెప్పారు. పోలీసులు యానిమాల్ అండ్ హస్ బెండరీ చట్ట నియమాలు ఉల్లంఘించిన నేరం గా కేస్ నమోదు చేశారు. ద్వారకా క్రైమ్ సి.ఐ విజయ్ కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.