జిల్లాకు క్రొత్త ఓటరు గుర్తింపు కార్డులు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. గత 3 – 4 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న 49, 330 ఓటర్ గుర్తింపు కార్డులు జిల్లాకు చేరినట్లు ఆయన తెలిపారు. పోస్టల్ శాఖచే స్పీడ్ పోస్ట్ ద్వారా పంపుటకుగాను ఖమ్మం పోస్టల్ సూపరింటెండెంట్ బి. రవికుమార్ కు కార్డులు కలెక్టరేట్ లో కలెక్టర్ అందజేశారు. ఒకట్రెండు రోజుల్లో సంబంధిత అభ్యర్థులకు చేరుతాయని, స్వీకరణకు సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. గత నెలలో కాకుండా, అంతకుముందు క్రొత్తగా ఓటరుగా నమోదు చేసుకున్న వారికి సంబంధించిన కార్డులని, కార్డులు అందగానే కార్డులో ఉన్న వివరాలు తనిఖీ చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. గత నెల నుండి క్రొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పరిశీలన అనంతరం కార్డుల జారీకి చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ అన్నారు.
previous post