29.7 C
Hyderabad
May 6, 2024 06: 52 AM
Slider నెల్లూరు

వి ఎస్ యూ అంతర్ కళాశాలల మహిళా టోర్నమెంట్

#VSU Inter College Women's Tournament

కాకుటూరు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ప్రాంగణంలో అంతర్ కళాశాలల మహిళా గేమ్స్ టోర్నమెంట్ ని ఉపకుపతి జి.యం సుందరవల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపకుపతి జి.యం సుందరవల్లి మాట్లాడుతూ ప్రతి మనిషికి జీవితంలో క్రీడలు ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయని, క్రీడలకు వయసుతో సంబంధం ఉండదని తెలిపారు.
రిజిస్ట్రార్ ఆచార్య పి.రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గెలుపు ఓటములు సమానంగా స్వీకరించాలని తెలిపారు.

అలాగే ప్రిన్సిపాల్ ఆచార్య విజయ నంద్ కుమార్ బాబు, స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ డా కే.సునీత క్రీడాకారులందరికీ అభినందనలు తెలియజేశారు. గెలుపొందిన విజేతలకు ఉపకుపతి చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు. టెన్నికాయిట్ విన్నర్ గా వి ఎస్ యూనివర్సిటీ నెల్లూరు, రన్నర్స్ గా డీకే డబ్ల్యు నెల్లూరు బహుమతులు అందుకున్నారు. టేబుల్ టెన్నిస్ లో విన్నర్ గా డీకే డబ్ల్యూ నెల్లూరు, రన్నర్స్ గా వి ఎస్ యూ పి జి సెంటర్ కావలి గెలుపొందారు. షటిల్ బ్యాడ్మింటన్ లో విన్నర్స్ గా డీకే డబ్ల్యూ నెల్లూరు, రన్నర్స్ గా వి ఎస్ యూ నెల్లూరు గెలిచారు. ఈ కార్యక్రమానికి ఆ.ర్గనైజింగ్ సెక్రటరీ రవీంద్రమ్మ, పిడి డా ప్రవీణ్ కుమార్, పి డి మణికంఠ పాల్గొన్నారు

Related posts

రక్తదాన శిబిరంలో ఉత్సాహంగా పాల్గొన్న యువకులు

Satyam NEWS

వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏమిటి?

Sub Editor

కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలంటూ మానవహారం

Satyam NEWS

Leave a Comment