సమీకృత జిల్లా కార్యాలయాల భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పనులను తనిఖీలు చేశారు. భవన ఆవరణలో అంతర్గత రహదారుల పనులు జరుగుతున్నట్లు ఆయన అన్నారు. ప్లాంటింగ్. మొక్కలు, పచ్చదనం అంతా వెంటనే ఆవరణలోకి తెప్పించాలన్నారు. లైట్లు, ఫ్యాన్ల బిగింపు పూర్తి కావచిందన్నారు. ఏసీ, లిఫ్ట్, ఫౌంటెన్, ఇతర విద్యుత్ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. వారంలోపల విద్యుత్ పనులన్నీ పూర్తి కావాలన్నారు. కిటికీలు, ఫ్రెములు, వెంటిలేటర్లు ఇంకనూ రావాల్సి ఉన్నవాటి విషయమై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. అంతర్గత రహదారి లో 40 స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయాల్సిఉందన్నారు. ఇంకనూ సరఫరా కావాల్సిన సామాగ్రి వెంటనే చేరేలా చర్యలు చేపట్టాలన్నారు. పనులన్నీ డిసెంబర్ 7లోగా పూర్తి కావాలన్నారు. అధికారులు పనుల నిరంతర పర్యవేక్షణ చేసి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ తనిఖీ సందర్భంగా డిఆర్వో శిరీష, ఆర్ అండ్ బి ఇఇ శ్యామ్ ప్రసాద్, మునిసిపల్ ఇఇ కృష్ణ లాల్, అధికారులు, తదితరులు ఉన్నారు.
previous post