38.2 C
Hyderabad
April 27, 2024 17: 51 PM
Slider గుంటూరు

జగన్ రెడ్డి పాలనలో రక్షణ కరవైన ముస్లిం సోదరులు

#mim

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనలో ముస్లిం మైనారిటీలకు రక్షణ లేకుండా పోయిందని గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంఐఎం పార్టీ నాయకుడు మస్తాన్ వలీ అన్నారు. రాష్ట్రం లో ఎక్కడ చుసినా ముస్లిం మహిళలపై యువకులపై దాడులు హత్యలు అత్యాచారాలు ఎక్కువై పోయాయని ఆయన అన్నారు. ముఖ్యంగా అధికారులు కూడా ముస్లింలను వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు.

తాను అధికారం లోకి వస్తే ముస్లిం మైనార్టీ లకు రక్షణ కవచం గా వుంటానని చెప్పిన జగన్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అభివృద్ధి అంటే ముస్లిం ల దగ్గర వున్న కొద్దిపాటి భూములను లాక్కోవటమేనా అని ఆయన ప్రశ్నించారు. కడప జిల్లా మైదుకూరు కు చెందిన అక్బర్ బాషా పోలాన్ని ముఖ్యమంత్రి బంధువు లాక్కోవడంపై మస్తాన్ వలీ తీవ్రంగా అభ్యంతరం చెప్పారు.

అధికారం ఉపయోగించి ముస్లిం కుటుంబాలను ముఖ్యమంత్రి బంధువులే వేధిస్తున్నారని, వేధింపుల నుంచి కాపాడాల్సిన పోలీసులు అధికార పార్టీ వారికి రక్షణగా నిలుస్తున్నారని ఆయన అన్నారు. బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న ముస్లిం నాయకులను కూడా పోలీసులు అరెస్టు చేయడం దారుణమైన విషయమని ఆయన అన్నారు. ఎం ఎస్ సుధాకర్, సత్యంన్యూస్.నెట్  

Related posts

కూలి అవసరమైన ప్రతి వారూ లేబర్ కార్డు పొందాలి

Satyam NEWS

కరోనా వ్యాక్సిన్ వికటించి వాలంటీర్ మృతి

Satyam NEWS

టియుడబ్ల్యూజేతోనే జర్నలిస్టుల సమస్యల పరిష్కారం

Satyam NEWS

Leave a Comment