బస్తీ సమస్యల పరిష్కారానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. అంబర్ పేట డివిజన్ న్యూ పటేల్ నగర్ లోని కమ్యూనిటీ హాల్లో బూత్ స్థాయి కమిటీ సమీక్ష సమావేశంలో నేడు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త ప్రజలతో కలిసిమెలిసి ఉండాలని, బస్తిలలో ఉన్న ఇబ్బందులు తన దృష్టికి తీసుకు వస్తే సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. ప్రతి బూత్ లో కార్యకర్తలు చురుగ్గా పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు మైనార్టీ నాయకులు, డివిజన్ ప్రధాన కార్యదర్శి జాఫర్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట