వైఎస్సార్ తెలంగాణ పార్టీ జహీరాబాద్ పార్లమెంటరీ ఇంచార్జ్ గా బోరిగి సంజీవ్ ను నియమించినట్టు వైఎస్సార్ తెలంగాణ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్బంగా మదునుర్ మండలంలోని కుర్లా గ్రామ శివారులో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు.
అనంతరం నూతనంగా నియమించబడిన సంజు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి జహీరాబాద్ పార్లమెంట్ బాధ్యతలు అప్పగించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ తెలంగాణ పార్టీని గెలిపించి షర్మిలమ్మకు ముఖ్యమంత్రి చేయడమే తన ముందున్న ధ్యేయమన్నారు.
అందుకుగాను జుక్కల్ నియోజకవర్గ ప్రజలు సహకరించాలన్నారు. కార్యక్రమంలో ఆయనతోపాటు గోపన్పల్లి అశోక్ ,భాను ,అవారి సాయిలు,బసవరాజు పటేల్, పాండు పటేల్ ,అప్పారావు పటేల్ ,బషీర్,జీవన్ తో పాటు తదితరులున్నారు. సత్యం న్యూస్, జుక్కల్