29.7 C
Hyderabad
May 2, 2024 05: 22 AM
Slider కడప

సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాం: పసుపులేటి ప్రదీప్ కుమార్

#Pradeep Kumar

తన తండ్రి రాజంపేట మాజీ ఎమ్మెల్యే,మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య స్పూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని యువ నాయకుడు పసులేటి ప్రదీప్ కుమార్ తెలిపారు. దివంగత మాజీ ఎమ్మెల్యే పసుపులేటి బ్రహ్మయ్య నాలుగవ వర్ధంతి సందర్భంగా తనయుడు ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో బ్రహ్మయ్య వర్గీయులు అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులో భాగంగా నందలూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో పసుపులేటి బ్రహ్మయ్య చిత్ర పటానికి నివాళులు అర్పించారు.అనంతరం వైద్య అధికారులు సృజన, చంద్ర శేఖర్ రెడ్డి చేతుల మీదుగా ఆసుపత్రి లోని రోగులకు పండ్లు,బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆడపూరు ముక్తి కనుమ వద్ద ఉన్న పరిపూర్ణ సత్సంగ ఆశ్రమంలో అన్నదానం నిర్వహించారు.

పేదలకు సేవ చేయడమే లక్ష్యంగా తమ తండ్రి పసుపులేటి బ్రహ్మయ్య ప్రజల హృదయాలల్లో నిలిచిపోయారని వారి ఆశయాలని తాను తన సోదరుడు పసులేటి పవన్ కుమార్ కొనసాగిస్తున్నట్లుగా పసుపు లేటి ప్రదీప్ కుమార్ తెలిపారు.

ఇంకాఈ కార్యక్రమంలో శ్రమ నిర్వాహకులు చొక్క రాజు రవి రాజు,నాగిరెడ్డి సుబ్బా రెడ్డి,టీడీపీ నేతలు మాజీ మండల అధ్యక్షుడు ఎద్దుల వెంకటేశ్వర్లు,రాష్ట్ర టీడీపీ బిసి కార్యదర్శి తాటి సుబ్బరాయుడు,పసుపు లేటి వీరయ్య,ప్రతాప్, బాబు,మధు,చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

పి వి నరసింహారావుపై కవితల పోటీ ఫలితాలు వెల్లడి

Sub Editor

ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను.. అమ్మానాన్న నన్ను క్షమించండి

Satyam NEWS

సగిలేరు డ్యామ్ లో తల్లి ఇద్దరు పిల్లల మృతదేహాలు

Satyam NEWS

Leave a Comment