32.2 C
Hyderabad
May 9, 2024 22: 48 PM
Slider గుంటూరు

యువగళంలో లోకేష్ ని కలిసిన బాలకోటయ్య

#balakotaiah

యువగళం పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను అమరావతి బహుజన ఐకాస   అధ్యక్షులు పోతులబాలకోటయ్య మర్యాదపూర్వంగా కలుసుకొని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్  ప్రతిమను బహూకరించారు. సోమవారం నిడమానూరు శివారు క్యాంపు సైట్లో లోకేష్ తో ఆయన ముఖాముఖి మాట్లాడారు.  రాష్ట్రంలో వైకాపా పాలనలో జరుగుతున్న ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీల దాడులపై వివరణాత్మకమైన నివేదికను అందజేశారు.  రానున్న కాలంలో దళితుల సంక్షేమ పథకాలు ఎత్తివేతతో పాటు హత్యలు, అత్యాచారాలపై తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో బలమైన హామీలను దళితుల భరోసా కొరకు పొందు పరచాలని కోరారు.  ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ దళితులపై జరుగుతున్న దాడుల సంఘటనలు కలచి వేస్తున్నాయని, దీనిపై దళిత సంఘాలు మరిన్ని ఉద్యమాలను చేయాలని బాలకోటయ్య కు సూచించారు. నివేదికను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. బాలకోటయ్య తో పాటు తెదేపా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురాం తెలుగు దేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి, అమరావతి ఉద్యమ నాయకులు వెలగపూడి గోపాలకృష్ణ తదితరులు ఉన్నారు.

Related posts

లాక్ డౌన్: ఆటోవాలాలకు మంత్రి హరీశ్ అండ

Satyam NEWS

స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్ట బందోబస్త్

Satyam NEWS

త్రిబుల్ ఆర్ కొత్త సీరీస్: రైతు బకాయిలు చెల్లించు జగనూ

Satyam NEWS

Leave a Comment