ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రస్తకే లేదని ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు తమకు ఐదేళ్లు పరిపాలన కోసం గెలిపించారని ఆయన అన్నారు. తాము ముందుగానే ఎన్నికలకు వెళతామని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రజలు ఇచ్చిన తీర్పును కాదని ముందుగానే ఎన్నికలకు వెళ్లే అవసరం తమ ప్రభుత్వానికి లేదని అన్నారు. ప్రజలను మోసం చేసేవారు, భ్రమలో ఉంచేవారే ముందస్తుకు వెళ్తారని, చంద్రబాబు తన పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు ముందస్తు రాగం తీస్తున్నారని వ్యాఖ్యనించారు.
previous post