కడపజిల్లా ఒంటిమిట్ట మండలం శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా మంగళవారం నాడు సీతారాముల వారికి రాష్ట్ర నలుమూలల నుండి వందల సంఖ్యలో పద్మశాలీయులు హాజరై ప్రత్యేక పూజలు చేసి శాస్రోత్తమంగా స్వామివారికి పట్టు వస్ర్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాజంపేట శాసన సభ్యులు మేడా వెంకట మల్లిఖార్జున రెడ్డి హాజరు కాగా కార్యక్రమంలో ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి, పద్మశాలి కార్పోరేషన్ చైర్మన్ జింకా విజయలక్ష్మి, డైరెక్టర్ నక్కా వేంకటేశ్వర్లు, వెంకటగిరి మునిసిపల్ కౌన్సిలర్ మాడా జానకి రామయ్య, శ్రీహరి,ఓబయ్య, శ్రీను, రవిశంకర్, వెంకట్, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.
previous post
next post