ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో సెకండ్ ఫేస్, సాఫ్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లీగ్ 2022,డిస్టిక్ లేవిల్ కాంపిటీషన్ మంగళవారం కాకినాడ లో ప్రారంభించారు. కాకినాడలో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆధారిటీ వెయిట్ లిఫ్టింగ్ కోచ్ వర్రీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పోటీలను దూరదర్శన్ హైదరాబాద్ కరెస్పాండెంట్ నండూరి బాల సుబ్రమణ్యం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కాంపిటీషన్ లో 20 మంది బాలురు, 10 మంది బాలికలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నండూరి బాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వెయిట్ లిఫ్టింగ్ లో క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని క్రీడాకారులను ఉద్దేశించి పేర్కొన్నారు. పోటీలో పాల్గొన్న క్రీడాకారులు కోచ్ వర్రీ సతీష్ కుమార్ ను కొనియాడారు.
previous post
next post