టీడీపీ హాయింలో విజయనగరం పార్టీ నేత అశోక్ గజపతిరాజు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి గా ఉన్న సమయంలో నే విశాఖ-రాయపూర్ రోడ్ పొడిగింపు జరిగిందని టీడీపీ నేతలు ఐవీపీ రాజు ,ప్రసాదుల లక్ష్మీ వర ప్రసాద్ తదితర నేతలు స్పష్టం చేసారు.
నాడు మంజూరైన రోడ్ కు నిధులు కూడా అప్పుడే కేంద్రం ఇచ్చిందని… ఆ రోడ్ అభివృద్ధి చేసిన ఘనత టీడీపీ దేనని నేతలు నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా విజయనగరం లో గుంకలాం నుంచీ జొన్నవలస ,రాకోడు ,దుప్పాడ ల మీదుగా నిర్మించిన రోడ్ పై మీడియా ను వెంట పెట్టుకుని ప్రత్యక్షంగా చూపించారు.
మొత్తం 17న్నర కిలోమీటర్ల…415 కోట్ల తో అభివృద్ధి జరిగిందని… టీడీపీ సీనియర్ నేత ఐవీపీ రాజు అన్నారు. ఇక ఈ అభివృద్ధి ని మరచిన స్థానిక ఎమ్మెల్యే కేవలం నగరంలో వీధి లైట్లు రోడ్ల వేసినంత మాత్రాన అభివృద్ధి కాదని… అసలు ఈ రాయపూర్ రోడ్ ను పట్టించుకోలేదని విమర్శించారు.