ఆర్థిక ఇబ్బందులతో ఒక జంట ఆత్మహత్య చేసుకోవడం విశాఖ పట్నంలో కలకలం రేపింది. అంతే కాకుండా వారు సెల్ఫీ వీడియో తీసుకుని మరీ ఆత్మహత్య చేసుకోవడం చూసిన వారికి కంటతడి తెప్పించింది. విశాఖపట్నంలోని గాజువాక ప్రాంతంలోని వడ్లపూడి తిరుమల నగర్ లో చిత్రాడ వరప్రసాద్ (47) స్టీల్ ప్లాంట్ ఉద్యోగి భార్య మీరా (41) ఈ దారుణానికి పాల్పడ్డారు.
ఆర్ధిక ఇబ్బందుల వల్లే తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని వారు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. సెల్ఫీ వీడియో తీసి బంధువులకి కుటుంబ సభ్యులకి భార్య భర్తలు పంపించారు. విషయం తెలుసుకున్న 19 సంవత్సరాల కుమారుడు కిృష్ణ సాయితేజ దువ్వాడ పోలీస్స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. సెల్ఫీ వీడియో తీసిన తర్వాత వారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. దాంతో వారి ఆచూకీ తెలియలేదు. అనకాపల్లి కొప్పాక ఏలూరు కాలువ వద్ద చెప్పులు హ్యాండ్ బ్యాగు మొబైల్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన దువ్వాడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.