31.2 C
Hyderabad
May 2, 2024 23: 11 PM
Slider విశాఖపట్నం

రియల్ ఎస్టేట్ వ్యాపారికి గన్ మెన్ లు ఎందుకు?

B V Ram

విశాఖపట్నం ఉత్తర నియోజక వర్గ సమన్వయ కర్త కే కే రాజు కి ప్రభుత్వం కేటాయించిన గన్ మేన్ ల సెక్యూరిటీ ని తక్షణమే ఉపసంహరించాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ ని కలిసి ఆయన ఈ మేరకు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కే కే రాజు కేవలం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి మాత్రమే నని, ఆయనకు ప్రాణహాని వుందని సెక్యూరిటీ తీసుకున్నారని తెలిపారు. అయితే గత నెల 27వ తేదీ న విశాఖ పర్యటన కు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ని అడ్డగించడంలో ఒక రౌడీ లా ప్రవర్తించిన వ్యక్తి కి సెక్యూరిటీ ఎందుకని బివి రామ్ ప్రశ్నించారు.

తక్షణమే కేకే రాజు సెక్యూరిటీ తొలగించక పోతే కేంద్ర హోంమంత్రి కి ఫిర్యాదు చేస్తానన్నారు. విశాఖ లో సామాన్య ప్రజలకు కూడా ప్రాణహాని వుందని అందరికీ పోలీస్ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 8వ తేదీ న రాజధాని అనుకూలమా కాదా అనే అంశం పై సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, ఈవి షయమై కలెక్టర్ అనుమతి తీసుకోగా పోలీస్ కమీషనర్ ని కలవమన్నారని  అన్నారు. అధికారులు అనుమతి ఇవ్వకపోతే తదుపరి న్యాయపరంగా అనుమతులు తీసుకుంటానన్నారు. ఈ సమావేశానికి హోం మంత్రి సుచరిత,పర్యాటక శాఖ మంత్రి ముత్తెంశెట్టి శ్రీనివాస్ రావు ని ఆహ్వానిస్తున్నామని తెలిపారు.

Related posts

క్యూనెట్ లాంటి ఎంఎల్ఎం సంస్థల వలలో చిక్కుకోవద్దు

Bhavani

రేపటి నుంచి వర్షాలు కురియవచ్చు….

Satyam NEWS

రుణ దరఖాస్తు గడువును పొడిగించండి.

Bhavani

Leave a Comment