స్థానిక సంస్థల్లో 50 శాతం మించి రిజర్వేషన్లు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవోను రాష్ట్ర హైకోర్టు సస్పెండ్ చేసింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో 59 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఇచ్చిన విషయం తెలిసిందే.
రిజర్వేషన్లు మళ్లీ ఖరారు చేసి ఈ నెలాఖరు లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ ఈ నెలాఖరు లోపు స్థానిక ఎన్నికలు పూర్తి కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 14 ఆర్ధిక సంఘం నుంచి రావాలిసిన నిధులకు బ్రేక్ పడే అవకాశం ఉండటంతో ప్రభుత్వంలో టెన్షన్ నెలకొంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్ధిక పరిస్థితి దినదినగండంగానే నడుస్తుంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే 14 ఆర్ధిక సంఘం విడుదల చేసే 3 వేలకోట్ల రూపాయలకు పైబడి నిధులు వెనక్కి వెళ్లిపోయే అవకాశం ఉండటంతో ఏపీ ప్రభుత్వం లో టెన్షన్ నెలకొంది.