40.2 C
Hyderabad
May 2, 2024 17: 26 PM
Slider గుంటూరు

మహాశక్తి ప్రారంభోత్సవ కార్యక్రమానికి తరలి వెళ్లిన తెలుగు మహిళ

#chadalawada

చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహాశక్తి కార్యక్రమానికి శుక్రవారం నాడు నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబును కలిసి ప్రయాణానికి తెలుగు మహిళలు సిద్ధమయ్యారు. తెలుగు మహిళల ప్రయాణానికి నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-చార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు పచ్చ జెండా ఊపి తెలుగు మహిళల ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డా౹౹చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ తెలుగు మహిళల మహాశక్తి కార్యక్రమం వైసీపీ అవినీతి,అక్రమాలను అంతమొందించే ఆదిపరాశక్తి అవుతుందన్నారు.

రాష్ట్రంలో మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు చేసి,అత్యాచారాలు చేసిన వైసీపీ నాయకుల అధికార మదాన్ని అణిచివేయడానికి ప్రతి మహిళ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మహాశక్తి కార్యక్రమం మహిళలను ఆర్థిక,సామాజిక,రాజకీయ రంగాలలో అగ్రగామిగా నిలుపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.మహిళా సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటుందని చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాలు ఏర్పాటుతో మహిళలకు ఆర్థిక చేయూతను అందించారన్నారు. నందమూరి తారక రామారావు మహిళలకు ఆస్తిలో సమాన వాటా చట్టం తెచ్చారని గుర్తు చేశారు.

మహిళలను అగ్రగామిగా నిలిపే తెలుగుదేశం పార్టీ విజయంలో తెలుగు మహిళా విభాగం కీలక భూమిక పోషించాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ మహిళా నాయకులు దాసరి ఉదయశ్రీ,కనుమూరి లక్ష్మి,క్రోసూరి రాధికా,కదం నాగజ్యోతి,కొండ్రగుంట లక్ష్మి,చావా నాసరమ్మ,మస్తాన్ బి,అమీరున్,ఉడత రాజ్యలక్ష్మి,వెంకాయమ్మ,లక్ష్మీ,లావణ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

తితిదే బోర్డు సభ్యుల నియామకాలను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిల్‌

Satyam NEWS

కృష్ణ మృతిపట్ల కే‌సి‌ఆర్ సంతాపం

Murali Krishna

ఎన్నికల నియమావళి ప్రకారం  అనుమతులు

Satyam NEWS

Leave a Comment