26.7 C
Hyderabad
May 3, 2024 10: 56 AM
Slider ముఖ్యంశాలు

తితిదే బోర్డు సభ్యుల నియామకాలను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిల్‌

#AP High Court

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలకమండలి సభ్యుల నియామకాలను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. నేరచరిత్ర, లిక్కర్ వ్యాపారాలు చేస్తున్న వారిని తితిదే బోర్డు సభ్యులుగా నియమించడం సరి కాదని చింతా వెంకటేశ్వర్లు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు. తితిదే బోర్డు సభ్యులుగా ఎన్నికైన ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, కేతన్ దేశాయ్, శరత్ చంద్రారెడ్డి నియామకాలను ఆయన సవాల్ చేశారు. ఈ ముగ్గురిని తితిదే బోర్డు సభ్యులుగా తొలగించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ అంశం కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు..

Related posts

కుల్గాంలో ఉగ్రదాడులు.. కూలీలపై కాల్పులు.. ఇద్దరు మృతి

Sub Editor

పౌరసత్వ చట్టంపై అవగాహన కార్యక్రమం

Satyam NEWS

నెల్లూరు కోర్టులో చోరీ న్యాయవ్యవస్థకే మాయని మచ్చ

Satyam NEWS

Leave a Comment