రంగారెడ్డి జిల్లా లోని శ్రీ ఇందూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ మరియు అనుబంధ శాఖల విభాగాలు “పరిశోధన అంశాలు: చదవడం & వ్రాయడం ఎలా’’ అనే అంశంపై ఒక రోజు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ను నిర్వహించాయి. కళాశాల ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 130 మంది అధ్యాపకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సిబిఐటి కళాశాల నుండి డాక్టర్ జిఎన్ఆర్ ప్రసాద్, ఇందూ కాలేజి నుంచి డా. ఎస్ కిషోర్ వర్మ, డా. ఆర్. సుకుమార్ అసోక్ లు తమ పరిశోధనల అనుభవాన్ని వివరించారు.
పరిశోధన విధానాలను, ప్రక్రియను వివరించారు. పరిశోధనా లో సమాచార సేకరణ, విశ్లేషణ మరియు వివరణ కోసం వివిధ పద్ధతులను వివరించారు. పరిశోధన లక్ష్యం, పరిశోధన అనుభవం, పరిశోధనా అధ్యయనానికి సంబంధించిన ఎంపికకు కావల్సిన వివిధ అంశాలు గురించి చెప్పారు. పరిశోధన అనేది ఒక ప్రశ్న సమాధానం కోసం జరిగే అన్వేషణ. ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకోవాలంటే శాస్త్రీయ పద్ధతి అవసరం మరియు కేవలం వివిధ వ్యక్తుల నుండి అడగడం లేదా అడిగిన ప్రశ్నలకు అస్పష్టమైన సమాధానాలను అందించే అనేక పరిస్థితులను గమనించడం మాత్రమే కాదు.
పరిశోధన అనేది మరింత తెలుసుకోవడం కోసం, మరింత జాగ్రత్తగా పరిశీలించడానికి చాల అవసరం. ఇది క్రమబద్ధమైన పరిశీలన, ప్రయోగాల ద్వారా మనకు ఇప్పటికే తెలిసిన వాటిని విడుదల చేయడం ద్వారా మెరుగైన జ్ఞానాన్ని సంపాదించడానికి ఉద్దేశించిన ఒక కార్యాచరణ అని తెలుసుకోవాలని డాక్టర్ జి ఎన్ ఆర్ ప్రసాద్ తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి సురేష్, ప్రోగ్రామ్ కన్వీనర్ ప్రొఫెసర్ కె సదాశివరావు మరియు కో-ఆర్డినేటర్ డాక్టర్ పి చరణ్సింగ్ తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.