రాష్ట్రంలో ఏ ఒక్క పథకాన్ని వదలకుండా అడ్డగోలుగా జగన్ ప్రభుత్వం వాడుకుంటోందని తెలుగు దేశం పార్టీ విమర్శించింది. ఆఖరికి కార్పొరేషన్ నిధులను కూడా దారిమళ్లించి…తమతమ జేబులను వైఎస్సార్సీపీ నేతలు నింపుకుంటున్నారని టీడీపీ విజయనగరం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఆరోపించారు.
ఈమేరకు పార్టీ కార్యాలయమైన అశోక బంగ్లాలో మీడియా సమావేశంలో పార్టీ కి చెందిన బీసీ నేతలతో మాట్లాడారు. పార్టీ పరంగా బీసీలకు జరుగుతున్న అన్యాయం పై తమ పార్టీ దానిని తిప్పి కొట్టేందుకు సన్నద్ధం అవుతోందన్నారు.అందుకు ఈ నెల ఇరవై ఒకటిన విజయవాడలో బీసిల సమ్మేళనం కు హాజరవుతున్నట్లటు చెప్పారు. అసలు బీసీ లకు న్యాయం చేకూర్చిందే…దివంగత నేత టీడీపీ న ఎన్టీఆర్ న అని అన్నారు.
అసలు జగన్ ప్రభుత్వం….నామినేట్ పోస్టులను…ఇచ్చిందే..ఆయా వర్గాల నుంచీ దోచుకోవడానికేనని నాగార్జున విమర్శించారు. బీసీలను…జగన్ ప్రభుత్వం అణగదొక్కేందుకే..కంకణం కట్టుకుందని.. టీడీపీ ప్రభుత్వం అయితే… గతంలో బీసీ లను గుర్తించే…వారి అభ్యున్నతికి కృషి చేసిందన్నారు. కానీ ఈ జగన్ ప్రభుత్వం… విభజించి పాలించు అన్న ధోరణి లో పాలన సాగిస్తోందని…ఇంకెన్నాళ్లు.. ఈ ప్రభుత్వం ఆగడాలు సాగని నాగార్జున స్పష్టం చేశారు. ఈ సమావేశంలో టీడీపీ బీసీ నేతలు పార్టీ నగర శాఖ నేతలు పాల్గొన్నారు.