సి బి ఐ టి కళాశాల లో ఎసిఐసి – సిబిఐటి మరియు ఎఐసి ఐఐఐటి -హైదరాబాద్ సంయుక్తం గా ప్రపంచ సృజనాత్మకత మరియు ఆవిష్కరణ దినోత్సవం జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21 నాడు ప్రపంచ ఆవిష్కరణ మరియు సృజనాత్మకత దినోత్సవం జరుపుకుంటారు అని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి రవీందర్ రెడ్డి తెలిపారు. సమస్య-పరిష్కారంలో సృజనాత్మకత మరియు ఆవిష్కరణల ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడం మరియు ఆలోచనలను ప్రోత్సహించడం ఈ రోజు యొక్క ముఖ్య లక్ష్యమని ఎసిఐసి – సిబిఐటి సిఈఓ అన్నే విజయ అన్నారు . మరియు వివిద రకాల ఇన్నోవేషన్ టాక్స్ ద్వారా, విద్యార్థులలో వున్న సృజనాత్మక కు వెలికి తేయటకు మరియు మేము ఒక ప్లాట్ఫారమ్ను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నాము అని తెలిపారు.
ఈ కార్యక్రమం లో అశోక్ గొర్రె; చంద్రశేఖర్ ఎన్; ఉదయ్ భాస్కర్; సూరజ్ వి మెయ్యూర్; డాక్టర్ మెండె శ్రీనివాస్ లు తమ ఆవిష్కరణ గురుంచి , ఎదురుకొన్న వివిధ సవాళ్లు, మరియు అభ్యాసాలు గురుంచి మాట్లాడారు . ప్రతి వక్త విద్యార్థులకు తమ సలహాలను అందించారు . ఆలోచన రేకెత్తించే మరియు పురోగతిని ప్రేరేపించగల సమస్యల పట్ల సున్నితంగా ఉండండి. “బంగారం మరియు ఇనుప ఖనిజాలను సేకరించడంలో మైనింగ్ మీకు సహాయపడుతుంది, కానీ మెదడు త్రవ్వకం మీరు ఆవిష్కరణలను పండించడంలో సహాయపడుతుంది. ఈ కార్యక్రమం లో హాజరయ్యారు నూతన ఆవిష్కర్తలు మరియు స్టార్టప్ వ్యవస్థాపకులతో సహా 250+ అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఎఐసి ఐఐఐటి -హైదరాబాద్ నుండి రవిశంకర్ మరియు అబ్దుల్ , ఎసిఐసి – సిబిఐటి నుండి అతీక్ హుస్సేన్, ఈన్ను షేక్, వైష్ణవి రెడ్డి మరియు ఖదీజా ఈ కార్యక్రమ నిర్వహణలో భాగంగా ఉన్నారు అని కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు.