సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ లో నూతన సంవత్సరం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమక్షంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున రావు భారీ కేక్ కట్ చేసి పార్టీ నాయకులకు, హుజూర్ నగర్ పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
రానున్న కాలంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి, ఆయురారోగ్యాలతో ఉండాలని,పార్టీ శ్రేణులు అందరూ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేకుండా ఉండేలా పనిచేసి రాబోయే రోజుల్లో రాష్ట్రంలో,కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పిసిసి రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎం.డి.అజీజ్ పాషా, మున్సిపల్ కౌన్సిలర్లు కస్తాల శ్రవణ్ కుమార్,కోతి సంపత్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాముల శివారెడ్డి,బాచిమంచి గిరిబాబు, శివకుమార్ యాదవ్,బెంజిమెన్, కోల్లపూడి యోహాన్,ముశం సత్యనారాయణ,సైదా మేస్త్రి,కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్