పౌరసత్వ చట్టంలోని అభ్యంతరకరమైన విషయాలు అమలు కాకుండా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవో నెంబర్ 124తో అడ్డుకున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. పౌరసత్వ చట్టం, NRC, NPR లను అడ్డుకోవడానికి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎంత దూరమైనా పోతుందని ఆయన అన్నారు.
ఎంతటి త్యాగానికైనా, ఎంతటి పోరాటానికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. రాజ్యాంగాన్ని తూట్లుపొడిచే CAA, NRC, NPR చట్టాల రద్దు కోరుతూ ఓ ఎమ్మెల్యే గా 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు భారత రాజ్యాంగ పరిరక్షణ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.