39.2 C
Hyderabad
May 3, 2024 13: 44 PM
Slider కడప

కామెంట్: జగన్ మెప్పు కోసం ఉస్కో బ్యాచ్

tdp mlc

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మెప్పు పొందడమే లక్ష్యంగా అసలు ఐటీ శాఖ ఏం చెప్పిందో తెలుసుకోకుండా తెలుగుదేశం నేతలపై వైసిపి నాయకులు ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు అన్నారు. అవినీతి అవినీతి అని అరవడం తప్ప 9 నెలల్లో 9  రూపాయిలు అవినీతి జరిగింది అని నిరూపించలేక పోయారని ఆయన అన్నారు. వారి పత్రికలో అసత్య కథనాలతో సరిపెట్టుకుంటున్నారని ఆయన విమర్శించారు.

ఇప్పుడు వైకాపా ఉస్కో బ్యాచ్ తయారైందని ఆయన అన్నారు. జగన్ లా అందరూ అవినీతిపరులే అని ముద్ర వెయ్యడానికి వైకాపా నాయకులు కష్టపడుతున్నారని దొరబాబు అన్నారు. దేశంలో 40 ప్రాంతాల్లో జరిగిన ఐటీ శాఖ దాడుల్లో 85 లక్షలు దొరికాయి అని ఐటీ శాఖ అంటుంటే  చంద్రబాబు మాజీ పీఎస్ దగ్గర 2 వేల కోట్లు దొరికాయి అంటూ వైకాపా కట్టుకథ అల్లిందని ఆయన అన్నారు.

గతంలో వైఎస్ కూడా చంద్రబాబుపై అవినీతి మరక అంటించాలని ప్రయత్నించి విఫలమయ్యారని అన్నారు. 26 ఎంక్వయిరీ కమిటీలు వేసి కోర్టు చివాట్లు పెట్టే పరిస్థితి తెచ్చుకున్నారని దొరబాబు అన్నారు.

Related posts

“పిడికెడు ఆత్మగౌరవం కోసం”పేరుతో సదస్సు

Bhavani

బిజీ షెడ్యూల్:అలా వాళ్లిద్దరూ ఆఫీస్ లో ఒకటయ్యారు

Satyam NEWS

ప్రజా వినతులను పరిష్కరించాలి

Satyam NEWS

Leave a Comment