గత సంవత్సరం జమ్మూకాశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన దాడిలో 41 మంది భారత సైనికులు అశువులు బాసిన సంఘటనను గుర్తు చేసుకుంటూ ఈరోజు రంగారెడ్డి జిల్లా చౌదరి గూడెం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించిన ప్రజలు జవాన్ల ఆత్మకు శాంతి జరగాలని ప్రార్థించారు.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని మండల కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలీ ప్రదర్శించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో చౌదరిగుడ సర్పంచ్ గూడ వెంకటస్వామి ఉప సర్పంచ్ అనిల్ కుమార్ వార్డు సభ్యులు చౌదరిగుడా మండల వైస్ ఎంపీపీ ఆశ్ర బేగం ఏజ్జసలి, స్థానిక ఎస్సై సయీద్ యువకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.