“పిడికెడు ఆత్మగౌరవం కోసం” పేరుతో నవతరంపార్టీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించాలని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం ను కలసి అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య విజ్ఞప్తి చేశారు. చిలకలూరిపేటలో రావుసుబ్రహ్మణ్యం స్వగృహంలో ఇరువురు నేతలు భేటి అయ్యారు.
మంగళగిరి నవతరం పార్టీ కార్యాలయంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలను ఆహ్వానించి సదస్సు ఏర్పాటు చేస్తామని రావుసుబ్రహ్మణ్యం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలన వైఫల్యాలను ప్రజలకు వివరించే ప్రధాన ఎజెండాతో సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.