ప్రమాదం జరిగితే పదడుగుల దూరం పారిపోయే వారు ఉంటారు. కొందరైతే ప్రమాదంలో చిక్కుకున్నవారికి సాయం చేయకుండా సెల్పీలు తీసుకునే బ్యాచ్ ఉంటుంది. ఇవేవీ కాకుండా ప్రజా నాయకుడు అంటే ఎలా ఉండాలో చెప్పారు టీడీపీ నాయకుడు పంథాగాని నరసింహ ప్రసాద్. చెప్పడం కాదు చేసి చూపించారు. కడప జిల్లా రైల్వే కోడూరు మండలం తురక పల్లి వద్ద ఆటో బోల్తా పడి 4 గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
రైల్వే కోడూరు టీడీపీ నాయకుడు పంథాగాని నరసింహ ప్రసాద్ కుటుంబ సమేతంగా వివాహ వేడుకకు హాజరు అయ్యేందుకు అదే దారిలో వెళుతూ ఉన్నారు. జరిగిన ప్రమాదాన్ని చూసి ఆగారు. క్షతగాత్రులు రోడ్డు లో పడి వుండడం చూసి తన సొంత వాహనం లో ఆసుపత్రి కి తీసుకెళ్ళి చికిత్స చేయించారు. మానవత్వాన్ని చాటుకున్న నరసింహ ప్రసాద్ ను అందరూ మెచ్చుకున్నారు.