33.7 C
Hyderabad
April 29, 2024 00: 43 AM
Slider నల్గొండ

శాశ్వత నిర్మాణాలలో భాగంగా సిసి డ్రైనేజీ శంకుస్థాపన

#drinageworks

అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దే ధృఢ సంకల్పంతో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని మూడవ వార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గత రెండు సంవత్సరాలుగా వార్డు ప్రజలతో చర్చించి ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తూ ముందుగా రోడ్డు నిర్మాణం చేపట్టి వీధుల్లో సొంత ఖర్చులతో మట్టిని నింపినట్లు వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి అన్నారు.

ప్రస్తుతం శాశ్వత నిర్మాణం దిశగా మున్సిపల్ నిధుల నుండి డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయడం జరిగినదని ఆయన తెలిపారు. మూడవ వార్డులో ఒకవైపు డి.ఎం.ఎఫ్.టి నిధులతో సిసి రోడ్ల నిర్మాణం చేస్తూ మున్సిపాలిటీలో వార్డుల వారీగా కేటాయించే నిధులతో డ్రైనేజీ నిర్మాణాలు చేపడుతున్నట్లు సంపత్ రెడ్డి అన్నారు. త్వరలో నల్లగొండ  పార్లమెంట్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ నిధుల నుండి మూడవ వార్డు అభివృద్ధి నిధులు అందజేయాలని కోరడం జరిగిందని, అందుకు ఉత్తమ్ సానుకూలంగా స్పందించినట్లు వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో అతిథులుగా మున్సిపల్ కౌన్సిలర్లు కస్తాల శ్రవణ్ కుమార్,తేజావత్ రాజా నాయక్,23వ, వార్డు కౌన్సిలర్ జక్కుల వీరయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు వెల్దండ వీరారెడ్డి,వెంకటేశ్వర్లు,జైలు,సులువా చంద్రశేఖర్,కె.వెంకట్ రెడ్డి,వార్డు ప్రజలు అశ్విన్,కోటిరెడ్డి,శంబి రెడ్డి,మట్టపల్లి రావు,శివ,సాయి,వినోద్,యువకులు తదితరులు పాల్గొన్నారు. సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

అంతర్ జిల్లా దొంగ అరెస్ట్

Murali Krishna

న్యూ శాంతినగర్ సమగ్ర అభివృద్ధికి కృషి

Satyam NEWS

అయ్యప్ప భక్తులతో నిండిపోయిన తిరుపతి

Satyam NEWS

Leave a Comment