అన్నమయ్య జిల్లాలో రైల్వే కోడూరు లో వైసీపీలో నిరసన జ్యాలలు భగ్గు మన్నాయి.రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరమట్ల శ్రీనివాసులు వర్గీయులు తమ నాయకునికి మంత్రి పదవి ఇవ్వలేదని సోమవారం కోడూరు అంబేద్కర్ విగ్రహం వద్ద న్యాయం చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నల్ల జెండాలతో పెద్ద ఎత్తున వైసీపీ నేతలు, కార్యకర్తలు నిరసన తెలిపారు.సీఎం జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయాలని వినాదాలు చేశారు.వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన కొరముట్ల కు ఎమ్మెల్యే రాక పోవడంతో వారు ఆవేదన వ్యక్తంచేశారు.సామాజిక సమీకరణాలు, కొత్త జిల్లాల సమీకరణలో కోడూరు ఎమ్మెల్యే కొరమట్ల శ్రీనివాసులుకు కొత్త కేబినెట్ లో చోటు దక్కుతుందని భావించారు. అయితే అవకాశం ఇవ్వకపోవడం తో కొరమట్ల వర్గీయులు రోడ్డు పై బైఠాయించి నిరసన తెలియజేశారు.
previous post