లాక్డౌన్ అమలులో ఉన్న కారణంగా దినసరి కూలీలకు, నిరుపేదలకు ఇబ్బందులు తలెత్తకుండా యువజన కాంగ్రెస్ పలు కార్యక్రమాలు చేపడుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు నిత్యవసరాలు అందిస్తోంది.
తాజాగా ఎల్బీనగర్లోని లింగోజీ గూడా పరిధిలో 45 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించింది. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పన్యాల జైపాల్ రెడ్డి నేతృత్వంలో పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వాలు అందిస్తున్న తోడ్పాటు సకాలంలో అందండం లేదని దినసరి కూలీలను ఆదుకోవాలని జైపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.