ఎంపీ మిథున్ రెడ్డి , ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో రైల్వేకోడూరు నియోజకవర్గంలోని జర్నలిస్టులకు 5 లక్ష రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఒక మండలానికి లక్ష చొప్పున ఐదు మండలాలు జర్నలిస్టులకు ఐదు లక్షలు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
కోడూరు మండలం లోని జర్నలిస్టుల బైక్ పెట్రోల్ కోసం 35 వేల రూపాయల ఆర్థిక సాయం చేశారు. ఈ రోజు రైల్వే కోడూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విప్ కొరముట్ల శ్రీనివాసులు కోడూరు మండలం లోని జర్నలిస్టులందరికీ 25కేజీల బియ్యం, నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.
కరోనా వైరస్ మహమ్మారిని పారద్రోలేందుకు విధించిన లాక్ డౌన్ దృష్ట్యా కూడా నిత్యం ప్రజల్లో తిరుగుతూ ప్రజా సేవ చేస్తూ వార్తలు అందిస్తున్న జర్నలిస్టులకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.