యువత క్రీడల్లో రాణించాలని కొల్లాపూర్ మున్సిపల్ 16వ వార్డు కౌన్సిలర్ ఎస్ నరసింహ రావు అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మిని స్టేడియం లో కొనసాగుతున్న నియోజక వర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో మంగళవారం ఆయన టాస్ వేసి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఇరు జట్లకు ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పారు. ముందుగా బ్యాటింగ్ చేసి మ్యాచ్ ను ప్రారంభించారు.
ఈ సందర్బంగా యువత ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. యువత చదువు తో క్రీడల్లో ప్రతిభ కనబరిచి జీవితాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పదోవ వార్డు కౌన్సిలర్ షేక్ రహీం పాషా,మాజీ సర్పంచ్,టిఆర్ఎస్ పార్టీ నాయకులు మేకల నాగరాజు, ఎక్బాల్, దీలిప్ ముస్తాక్, పప్పి, వెంకటేష్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్