42.2 C
Hyderabad
April 26, 2024 15: 03 PM
Slider ముఖ్యంశాలు

పి సి.సి. కార్యదర్శిగా ఈడ్పుగంటి సుబ్బారావు

#GandhiBhavan

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఈడ్పుగంటి సుబ్బారావు తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కార్యదర్శిగా నియమితులయ్యారు. తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనకు నియామక పత్రాన్ని అందించారు.

 ఈడ్పుగంటి సుబ్బారావు హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ గ్రామ కో-ఆపరేటివ్ చైర్మన్ గా 2005-2020 (2 దఫాలు) ఏకగ్రీవంగా ఎన్నికై నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డైరక్టరుగా కూడా పనిచేశారు.

ఈయన తండ్రి దివంగత ఈడ్పుగంటి లక్ష్మీనారాయణ చాలాకాలం బూరుగడ్డ గ్రామ సర్పంచుగా, మండల కాంగ్రెసు అధ్యక్షుడిగా పనిచేశారు. 

తనపై నమ్మకంతో పిసిసి కార్యదర్శిగా నియమించినందుకు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీకి నూతనోత్తేజం తెచ్చి, బలోపేతం చేసేందుకు తీవ్ర కృషి చేస్తానని ఈడ్పుగంటి సుబ్బారావు ఈ సందర్భంగా తెలిపారు.

టిపిసిసి కార్యదర్శిగా ఎన్నికైన సుబ్బారావుకు జాతీయ INTUC  సంయుక్త కార్యదర్శి యరగాని నాగన్న, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ దేశముఖ్, టిపిసిసి అధికార ప్రతినిధి అల్లం ప్రభాకర్ రెడ్డి, DCMS డైరెక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు, ప్రణాళికా సంఘ మాజీ సభ్యులు నిజాముద్దీన్, మంజూనాయక్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

Related posts

ఓటమిపై స్పందించిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి

Sub Editor

జమ్మూ కాశ్మీర్ లో ఐదుగురు ఉగ్రవాదులు హతం

Satyam NEWS

న్యాయవ్యవస్థపై దాడి ఫ్యాషన్ అయిపోయింది

Satyam NEWS

Leave a Comment