28.7 C
Hyderabad
April 27, 2024 04: 06 AM
Slider నల్గొండ

పేద ప్రజల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం కృషి

#DevarakondaMLA

పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని నల్గొండ జిల్లా దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం  ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దేవరకొండ నియోజకవర్గానికి చెందిన 50మంది రూ.5.23లక్షల సీఎం సహాయ నిధి నుంచి మంజూరు అయిన చెక్కును ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ బాధితులకి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నామని ఆయన గుర్తు చేశారు. సీఎం సహాయ నిధి పేద ప్రజలకు వెలుగులు నింపుతుందని అన్నారు. ఆపదలో సీఎం సహాయ నిధి ఆపద్భాంధవునిగా ఆదుకుంటుందని ఆయన తెలిపారు.

మానవతా దృక్పథంతో సీఎం కేసీఆర్ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్దిక సహాయాన్ని మంజూరు చేస్తున్నారని అన్నారు. వైద్య చికిత్స చేసుకోలేక ఆర్దిక ఇబ్బందులు పడుతున్న  ఎన్నో కుటుంబాలకు ఈ ఫండ్ ఆసరాగా నిలుస్తుంది,బాధితులు అవసరమైన సమయంలలో సీఎం రిలీఫ్ ఫండ్ ను సద్వినియోగపర్చుకొవాలి అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ సిరందాసు కృష్ణయ్య, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్,ఉపుగంటి ప్రశాంత్ రావు,భాస్కర్ రెడ్డి,TRSV రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు, నియోజకవర్గ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

నిజాయితీ చాటుకున్న కండక్టర్

Satyam NEWS

పల్లె ప్రగతి స్పూర్తితోనే పట్టణ ప్రగతి కార్యక్రమం

Satyam NEWS

విత్ లాక్ డౌన్ రూల్స్: ‘వల్లూరిపల్లి’వారి వివాహ నిశ్చితార్థం

Satyam NEWS

Leave a Comment