38.2 C
Hyderabad
April 29, 2024 19: 39 PM
Slider నెల్లూరు

వి ఎస్ యూ లో వైయస్ రాజశేఖరరెడ్డి 74 వ జయంతి

#74th birth anniversary

కాకుటూరు లోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వ్యవస్థాపక ముఖ్యమంత్రి డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి 74 వ జయంతి సందర్భంగా ఎన్ ఎస్ ఎస్ విభాగం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య జి యం సుందరవల్లి పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ డా. వైఎస్సార్ భౌతికంగా దూరమైన ఆయన చేసిన మంచి పనుల ద్వారా ప్రజల లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిపోతారన్నారు. ముఖ్యంగా విద్య మరియు వైద్య రంగాల్లో ఆయన ప్రవేశపెట్టిన పథకాలు నభూతో నభవిష్యతి అని అన్నారు.

ఉన్నత విద్యారంగం లో జిల్లా కో విశ్వవిద్యాలయం స్థాపించాలని అనే ఆశయం లో భాగంగానే 2008 లో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఏర్పాటు అయిందని అన్నారు. విశ్వవిద్యాలయం లో పనిచేసే ప్రతి ఒక్కరు విశ్వవిద్యాలయం అభివృద్ధికి పాటుపడాలని కోరారు. డా. వైఎస్సార్ కలలుగన్న హరితాంధ్రప్రదేశ్ సాధనకై విశ్వవిద్యాలయం పాత్ర చాలా ముఖ్యమైనదని అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రిజిస్ట్రార్ ఆచార్య .పి రామచంద్రా రెడ్డి కోరారు.

తదనంతరం ఎన్ ఎస్ ఎస్, రెడ్ క్రాస్ వారు నిర్వహించిన రక్త దాన శిబిరాన్ని ప్రారంభించి రక్త దాతల కు ప్రశంసా పత్రాలు అందచేశారు. 52 యూనిట్ల రక్తాన్ని ఈ రక్త దాన శిబిరం ద్వారా సేకరించారు. చివరిగా వెంకటాచలం లో వున్నా సెయింట్ జ్యుడ్ మానసిక వికలాంగుల కేంద్రం సందర్శించి , పండ్లు, బియ్యం అందజేశారు. అక్కడ వున్న మానసిక వికలాంగులతో మమేకమై సమయం గడిపి వారిలో ఉత్సాహాన్ని నింపారు.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆచార్య విజయ ఆనంద కుమార్ బాబు డీన్ డా. సి హెచ్ విజయ, డిప్యూటీ రిజిస్ట్రార్, డా. సి హెచ్ సాయి ప్రసాద్ రెడ్డి , ఎన్ ఎస్ ఎస్ సమన్వయ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం, అసిస్టెంట్ రిజిస్ట్రార్ డా. జి సుజయ్, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం అధికారులు డా. కె. సునీత , డా. కె. విద్యా ప్రభాకర్ , ఆచార్య సుజా ఎస్ నాయర్, డా. టి. వీరారెడ్డి, డా.

ఆర్ ప్రభాకర్, డా. బి వి సుబ్బారెడ్డి, డా. వెంకట్రాయులు, డా. నీల మణికంఠ డా. హనుమా రెడ్డి, డా. ఉస్సేనయ్య , డా. చెంచు రెడ్డి డా. త్రివేణి, డా. వై. విజయ, డా. కిరణ్మయి, డా. మేరీ సందీప , డా. శ్రీకన్యా రావు , డా.సాయినాథ్, డా. విజేత, ఇతర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

పల్స్ పోలియో కార్యక్రమంలో పిల్లల నోట్లో శానిటైజర్

Satyam NEWS

రఘురామపై లోకసభ స్పీకర్‌కు వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు

Satyam NEWS

పంజాబ్ లో కొత్త మంత్రివర్గం..చన్నీ బృందంలో 15 మంది

Sub Editor

Leave a Comment